కర్నూలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణులు మాధురి, మధూరలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విద్యార్థినులు ఎస్పీని కలిశారు. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.