మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో సోమవారం తాగిన మత్తులో ఉన్న యువకుడు రమేష్ (22) కట్టెతో దాడి చేయడంతో బివి రాముడు (70) అనే వృద్ధుడు గాయపడ్డారు. గతంలో మురుగు కాల్వ, చెట్టు కొమ్మల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.