మంత్రాలయం నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ విజయం వెనుక మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు, గ్రామ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, భారీగా పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యుల సహకారం ఉందని మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి గురువారం తెలిపారు. అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.