ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎద్దులతో నాగలి దున్ని, ట్రాక్టర్ నడిపి కొత్త సాగు సీజన్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, RARS ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.