కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామంలో సాగు భూములు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో భూములు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు, పంట నష్టపరిహారం అందడం లేదని వాపోతున్నారు. ఏళ్లుగా అధికారులను సంప్రదించినా పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు.