నంద్యాల పట్టణంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమాలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.