కల్లూరు అర్బన్ 29వ వార్డు శరిన్ నగర్, ఠాగూర్ స్కూల్ పరిధిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వర్చువల్ మహానాడు 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి, క్లస్టర్-9 మహానాడు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.