నంద్యాల జిల్లాలో నమోదైన 36 గంజాయి కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 122 కేజీల 498 గ్రాముల గంజాయిని జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో NDPS చట్టం ప్రకారం JSW సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు పాల్గొన్నారు.