నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి లడ్డూ వివాదం నేటితో ముగిసిందని తెలిపారు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన, కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారాన్ని ఖండించారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని దర్యాప్తులో తేలిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.