కోవెలకుంట్ల మండలం రేవనూరు పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మద్దిలేటి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.