కల్లూరులోని తన నివాసంలో పాణ్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ బైరెడ్డి శబరి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా సమస్యలను స్వీకరించి, అధికారులతో చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.