నంద్యాల హజ్ సొసైటీ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డా. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించిందన్నారు. ఎంబార్కెషన్ పాయింట్గా విజయవాడను పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్కు ధన్యవాదాలు తెలిపారు. పాస్పోర్ట్ సమస్యలు ఉన్నవారు నేషనల్ కళాశాలలోని ఉచిత సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.