సినీ నిర్మాత బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుమల వరకు చేపట్టిన సంకల్పయాత్రకు ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రజావైద్యశాల మల్లికార్జున సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభిమానంతో చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.