ఏపీ సీడ్స్‌కు రూ. 200 కోట్లు.. రైతులకు ఊరట

రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, బకాయిల చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 200 కోట్లు విడుదల చేయడంపై ఛైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వరి, వేరుశనగ, పప్పుధాన్యాల విత్తనాల పంపిణీకి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నిధుల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్