నంద్యాల జిల్లా భీమవరంలో నూతన గ్రామ సచివాలయ భవనం, సి. సి. రోడ్డును మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి కలిసి సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా పారదర్శక పరిపాలన అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కొత్త మౌలిక వసతులతో గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.