నంద్యాల హరిజనవాడలో సోమవారం అర్ధరాత్రి అన్న, వదినల మధ్య జరిగిన గొడవలో మధ్యవర్తిగా వచ్చిన మరిది పెద్దన్న (20) దారుణ హత్యకు గురయ్యాడు. వదిన, ఆమె కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలైన పెద్దన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.