పాణ్యం మండలంలో ఇటీవల జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సుధాకర్, రాఘవేంద్ర, విష్ణు అనే నిందితులు రాత్రి సమయంలో పాణ్యం, భూపనపాడు, గడివేముల, బనగానపల్లె ప్రాంతాల్లో 21 గొర్రెలను దొంగిలించారు. వారిని అదుపులోకి తీసుకొని దొంగిలించిన గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు.