కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, శనివారం కల్లూరు మండలం పందిపాడు గ్రామంలో ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పాస్ పుస్తకాలలో క్యూఆర్ కోడ్తో భూ వివరాలు భద్రంగా ఉంటాయని, వీటిని ఇతరులు డూప్లికేట్ చేయలేరని తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, జాయింట్ ఎల్పిఎం వంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.