పాణ్యం మండలం కొత్తచెరువు సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున హైవేపై చోటుచేసుకుంది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన ప్రయాణికులలో కలకలం రేపింది.