కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్స్, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్–వాష్ అండ్ గో' కార్యక్రమం చేపట్టారు. డ్రైవర్లకు సూచనలిస్తూ, అతివేగం, రాంగ్ రూట్, ఓవర్లోడింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.