శనివారం కృష్ణగిరిలో జరిగిన సంఘటనలో, గుడెంపాడు గ్రామానికి చెందిన రేమట సోమేశ్వరరెడ్డి, అతని భార్య సోమేశ్వరమ్మ ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ ఉప్పరి వెంకట ప్రతాప్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సోమేశ్వరరెడ్డి మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.