పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆత్మకూరు పట్టణ కార్యదర్శి రణధీర్ డిమాండ్ చేశారు. గౌడ్ సెంటర్లో బైకులను తోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. పెట్రోల్పై రూ. 2. 61, డీజిల్పై రూ. 2. 71 పెంచి కూటమి ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.