బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట శివారులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల్లో ఉన్నారని, సబ్సిడీలు, నష్టపరిహారం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.