నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 4 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం కేవలం 1.20 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం వల్ల వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.