తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం పరిశీలించారు. బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు, ఏ. కోడూరు గ్రామాల్లో రైతులతో మాట్లాడి, పంట నష్టం వివరాలను APAIMS యాప్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి రైతు పొలం పరిశీలించి ఖచ్చితమైన అంచనాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో జాబితా పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.