గురువారం మహానంది క్షేత్రంలో ఫారెస్ట్ డైరెక్టర్ విజయ్కుమార్ శ్రీ మహానందీశ్వర–శ్రీ కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ శశిధర్రెడ్డి ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం విజయ్కుమార్ అభిషేకం, కుంకుమార్చనలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.