నంద్యాల జిల్లాలో భూగర్భజలాల పెంపు, నీటి వనరుల సమర్థ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్లో కొలిమిగుండ్ల ప్రాంతంలో 18 కి. మీ మేర ఐదు గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేసిన వివరాలు వెల్లడించారు. భూగర్భ జలాల మట్టం గణనీయంగా మెరుగుపడిందని, నీటి సంరక్షణకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆమె పేర్కొన్నారు.