మహానంది ఆలయానికి 60 రోజుల్లో రూ. 60 లక్షల ఆదాయం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మహానందిలో గత 60 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 60,18,167 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అభిషేక మండపంలో ఉభయ దేవాలయాల హుండీ కానుకలను లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల ఆదరణతో ఆలయ ఆదాయం గణనీయంగా నమోదైనట్లు ఈవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్