శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం పల్లకీ ఉత్సవం

శ్రీశైలంలో ఆదివారం సందర్భంగా దేవస్థానంలో స్వామి అమ్మ వార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్