శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నేడు సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం, నాగర్కర్నూలు జిల్లాల శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించనున్నారు.