శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. ఈ లెక్కింపులో రూ. 5,28,37,281 నగదు ఆదాయం లభించింది. అలాగే 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 1 కేజీ 780 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల నిఘా, పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు.