శ్రీశైలం డ్యాం ముందు తెలంగాణ పరిధిలోని పాతాళగంగలో స్నానం చేస్తుండగా రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదయ్య (45) అనే వ్యక్తి మృతి చెందారని పోలీసులు తెలిపారు. శంషాబాద్ మండలం రాళ్లగూడకు చెందిన అతను మరో ఇద్దరితో కలిసి శ్రీశైలం దర్శనానికి వచ్చి స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు చెప్పారు.