శ్రీశైలం జలాశయంలో 42. 60 టీఎంసీల నీటి నిల్వ

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు 42.6064 టీఎంసీలకు చేరుకున్నాయి. డ్యాం నీటిమట్టం 822.30 అడుగులుగా నమోదైంది. రెండు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా రోజుకు 303 క్యూసెక్కుల నీరు ఆవిరై తగ్గుతోంది.

సంబంధిత పోస్ట్