జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. మహానంది దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఆమె చెప్పారు. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన వందితను ప్రత్యేకంగా అభినందించారు.