ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, ప్రజలు సహకరించాలని కర్నూలు ఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఈ నెల 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని, అర్హులైన ఓటర్లను తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎస్ఐఆర్పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.