దివ్యాంగుల ప్రత్యేక అవసరాల గుర్తింపు సదస్సును జయప్రదం చేయాలని డీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి.సి నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరులో మాట్లాడుతూ ఈనెల నుండి ప్రతి గ్రామస్థాయి, మండల, పట్టణాల్లో దివ్యాంగుల ప్రత్యేక అవసరాల గుర్తింపు సదస్సులు నిర్వహిస్తామన్నారు. వీటిలో దివ్యాంగుల సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.