ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం ఎమ్మిగనూరులో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్న రైతులకు ఎప్పటికప్పుడు పరిహారం అందించి ఆదుకుంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తుంటే, వైకాపా ఉనికి కోసం అడ్డుతగులుతోందని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం పరితపిస్తుంటే, జగన్ మాత్రం ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నారని ధ్వజమెత్తారు.