ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం నది కైరవాడి గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన 50 మంది నాయకులు శనివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.