ఎమ్మిగనూరులో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప మాట్లాడుతూ, 2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ నెయ్యిని ఉపయోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం భక్తులకు ద్రోహం చేసిందని, కల్తీ నెయ్యితో 65 లక్షల లీటర్ల నేయి, 20 కోట్ల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు.