AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మరింత పుంజుకోవాలని యోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతినెలా 2 సార్లు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించుకుందామని, తద్వారా సభలో మనం ప్రస్తావించాల్సిన అంశాలపై స్పష్టత వస్తుందని శనివారం జరిగిన ఓ మీటింగ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.