AP: వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి వేల కోట్ల రూపాయల గండికొడుతూ సాగిన సిండికేట్ కుట్రను సిట్ అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. మంగళవారం విజయవాడలోని న్యాయస్థానంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు.