AP: రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనపై ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని రజత్ భార్గవ్కు సిట్ నోటీసులలో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అదుపులోకి తీసుకుంది.