AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ మూడు రోజుల క్రతువు ఆదివారంతో ముగియనుంది. ఇవాళ ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ప్రధాన ఘట్టాన్ని వీక్షించేందుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.