విశాఖలో పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో 8 హాళ్లను సిద్ధం చేస్తున్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు 33 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. ప్రాంగణంలో 1,600 మంది కూర్చొవచ్చు.

సంబంధిత పోస్ట్