ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య శాఖ మంత్రి లోకేశ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీని కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను టీవీలో చూశానని లోకేశ్ తెలిపారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడని ఆయన స్పష్టం చేశారు.