ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా నామీ ఐలాండ్ను సందర్శించారు. ఆ ఐలాండ్ సీఈవో మిన్ క్యోంగ్ వూతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. నామీ ఐలాండ్ అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునే అంశాలపై నామీ ద్వీపం సీఈవోతో మంత్రి నారాయణ చర్చించారు. కాగా, అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంలో నామీ ఐలాండ్లో అనుసరించిన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది.