ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ వెహికల్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాటాఏస్ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. మంత్రి సంధ్యారాణి సాలూరు నుంచి మెంటాడ వస్తుండగా ఆరికతోట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.