AP: శ్రీసత్య సాయి జిల్లా ధర్మవరంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి డప్పు కొట్టారు. ‘గోవిందా గోవిందా’ నామస్మరణతో స్థానిక ప్రాంతమంతా మార్మోగింది.