రాజీనామా ఆమోదం ఆలస్యంపై ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఆగ్రహం

తన ఎమ్మెల్సీ రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించకుండా కాలయాపన చేయడంపై ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల నిబంధనలకు అనుగుణంగా రాజీనామా చేసినా, న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ శాసనమండలి ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకే ఛైర్మన్ పనిచేస్తున్నారని, తన రాజీనామాను ఆమోదించకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్