AP: వైసీపీ అధినేత జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీని వీడారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్కు జగన్ అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించగా.. పార్టీ విడదల రజినీకి ఛాన్స్ ఇచ్చింది. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.